రైతుల త్యాగం వృథాకాకుండా రాజధానిని నిర్మిస్తున్నట్లు ఎపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆదివారం హైకోర్టు శాశ్వత భవనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ అమరావతిలో నిర్మించే నవనగరాల్లో న్యాయ నగరం కూడా ఒకటని.. బౌద్ధ స్థూపం రీతిలో అద్భుతంగా దాన్ని నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
న్యాయనగరంలోనే న్యాయాధికారులు, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోర్టుల్లో 1.70 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కేసులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అమలు చేస్తామని, ఏపీలో రానున్న నవ్య ఆవిష్కరణలు న్యాయవ్యవస్థకు దోహదం పడతాయని చెప్పారు.