telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రభుత్వ అకృత్యాలకు .. దీక్షలతోనే సమాధానం.. : చంద్రబాబు

chandrababu campaign in karnataka

ఏపీలో పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతున్నాయని టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుక కొరత, వైసిపి ప్రభుత్వ హత్యలకు నిరసనగా ఈనెల 14న విజయవాడలో 12 గంటల దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు. 35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సమస్యపై వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. స్పందనలో వినతులిచ్చిన చేతులతోనే పురుగుమందు తాగుతున్నారని, ఎమ్మార్వో, ఎండిఓ కార్యాలయాలకు పెట్రోల్‌ సీసాలతో వెళ్తున్నారన్నారు.

వైసిపి వేధింపులు భరించలేక ఆవేదనతో జనం ఈ పనులకు పాల్పడుతున్నారని అన్నారు. నిన్న పెద్దడోర్నాలలో ఇద్దరు మహిళా ఉద్యోగుల ఆత్మహత్యాయత్నాలు చేయడం బాధాకరమని, ఉద్యోగాలు తొలగిస్తామనే వేధింపులే ఇందుకు కారణమన్నారు. వైసిపి నేతలే చెన్న్తె, బెంగుళూరు, హైదరాబాద్‌కు ఇసుక అక్రమ రవాణా, చేస్తున్నారని, లారీ ఇసుక రూ.80వేల నుంచి లక్షకు అమ్మడం చరిత్రలో ఉందా అని ప్రశ్నించారు. ఈనెల 14న ఇసుక దీక్షతోనైనా వైసిపి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్నారు.

Related posts