జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, రేగొండ మండలం, కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులు ముఖ్యమంత్రి గారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనం అందించారు.
దేవాలయ అతిథి గృహంతో పాటు ఇతర అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దేవాలయ ప్రాంగణంలో మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి , స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.
కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టతనిచ్చారు.
ఏ జిల్లాను తొలగించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచనగానీ ప్రభుత్వ పరిశీలనలో లేదన్నారు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అలాంటి ఆలోచనలే ప్రభుత్వం చేయడం లేదని స్పష్టం చేశారు.

