telugu navyamedia
వార్తలు సామాజిక

కొనసాగుతున్న కోవిడ్.. 10 వేలకు పైగా కొత్త కేసులు!

Corona

దేశవ్యాప్తంగా కరోనా విజృంభించడంతో రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది.
కేంద్ర వైద్యశాఖ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు, గడచిన 24 గంటల్లో 10,667 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 10,215 మంది రికవరీ కాగా, 380 మంది మృత్యువాత పడ్డారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,53,178 యాక్టివ్ కేసులుండగా, 1,80,013 మంది రికవరీ అయ్యారని, 9,900 మంది మరణించారని అధికారులు గణాంకాలు విడుదల చేశారు. దేశంలో ఇప్పటివరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,43,091కి చేరుకున్నట్లయింది.

Related posts