శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ముని కుమార్ రైలు కింద పడి మృతి చెందారు. కడప రైల్వే గేటు వద్ద ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గతంలో కడప నగరపాలక కార్యాలయంలో సూపరిండెంట్ గా ముని కుమార్ విధులు నిర్వహించారు
మూడు నెలల కిందట డిప్యూటేషన్ పై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. కాగా, 2 రోజుల కిందట ముని కుమార్ పుట్టపర్తి నుంచి కడపకు వచ్చారు. ఏం జరిగిందో తెలియదు గానీ ఆయన రైలు కింద పడి మృతి చెందారు..
ఆత్మహత్యకు గల కారణాలపై రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. మణికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు రైల్వే పోలీసులు తరలించారు.