ఇటీవల బ్యాంకాక్లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ను భారత్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ను, బదిరుల ఒలింపిక్ క్రీడల్లో (డెఫిలింపిక్స్–2022) సత్తాచాటి కాంస్యం సాధించిన కర్నూల్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందించారు.
శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ కలిశారు.
ఈ సందర్భంగా ఇద్దరు క్రీడాకారులను శాలువా కప్పి సీఎం సన్మానించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటడం గర్వకారణమన్నారు.
షేక్ జాఫ్రిన్ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని… ప్రభుత్వం తరపున వారికవసరమైన అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులకు జగన్ సూచించారు .
ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు.