telugu navyamedia
తెలంగాణ వార్తలు

అగ్నిప‌థ్ స్కీమ్ ఆందోళ‌న‌లో మృతి చెందిన దామెర రాకేష్ సోద‌రుడుకు ప్ర‌భుత్వం ఉద్యోగం

కేంద్ర‌ప్ర‌భుత్వం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించారు. ఈ నెల 17న యువ‌కులు రైల్వే ఆస్తుల ధ్వంసం చేస్తూ యుద్దవాతావ‌ర‌ణం సృష్టించ‌డంతో..వారిని చెద‌ర‌గొట్టేందుకు ఆర్ఫీఎఫ్ పోలీసులు జ‌రిగిన కాల్పుల్లో వ‌రంల్‌ల్ జిల్లా ఖానాపురం మండలం డ‌బీర్‌పేట‌కు చెందిన దామెర రాకేష్ మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే..

Telangana: Govt job for brother of man killed in Secunderabad firing

అయితే ఆ కుటుంబానికి రూ.25ల‌క్ష‌ల ప‌రిహారంతో పాటు కుటుంబ స‌భ్యుల్లో అర్హులైన ఒక‌రికి ప్ర‌భుత్వం ఉద్యోగం క‌ల్పించ‌నున్న‌ట్టు రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల‌ను అనుగుణంగా మృతుడు దామెర రాకేష్ సోద‌రుడు దామెర రామ్ రాజుకు ఉద్యోగం క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం శుక్ర‌వారం ఉత్వ‌ర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌కుమార్‌..వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ బీ గోపీని ఆదేశించారు.

damera rakesh brother: Agnipath Protests: Damera Rakesh brother job ..  Government issued orders – kcr govt offers government job to brother of damera  rakesh who died in secunderabad agnipath protests
ఈ మేర‌కు కారుణ్య నియామ‌కం కింద విద్యార్హ‌త‌ల‌క‌నుగుణంగా వ‌రంగ‌ల్ జిల్లాలో రామ‌రాజును త‌గిన ఉద్యోగంలో పోస్టులో నియ‌మించాల‌ని సోమేశ్‌కుమార్ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

Related posts