telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆయన గొప్ప నాయకులు : ఉత్తమ్

ఎం సత్యనారాయణ రావ్ సంతపసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో అంకితభావం తో, క్రమ శిక్షణతో పని చేసిన గొప్ప నాయకులు. సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉండి నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిరంతరం శ్రమించిన మహా మనిషి. తెలంగాణ ప్రాంతం నుంచి అఖిల భారత స్థాయికి ఎదిగి గాంధి కుటుంబానికి నమ్మకం గల నాయకులుగా, అధిష్టానం ఆలోచలనకు తగ్గట్టుగా పార్టీని నడిపించిన నేతగా ఆయన నిలిచారు. నెహ్రు నుంచి రాహుల్ గాంధీ వరకు ఐదు తరాల నాయకులతో అనుబంధం నెరపి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నేత. ఎమ్యెల్యే గా, ఎంపీ గా, మంత్రిగా, ఆర్టీసీ ఛైర్మెన్ గా, పీసీసీ అధ్యక్షులుగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అనేక కీలక పదవులు నిర్వహించిన ఎంఎసార్ మన తెలంగాణకు గర్వకారణం. బతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని ముందుకు నడిపిన నేత. గాంధీ కుటుంబం తో సన్నిహిత సంబంధాలు ఉన్నా, అనేక పదవులు నిర్వహించినా ఎక్కడ కూడా అహంకారాన్ని ప్రదర్శించని నిగర్వి ఎమ్మేసార్, చిన్న కార్యకర్తల నుంచి పెద్ద నాయకులతోపాటు అందరిని కలుపుకొని పోయి పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేసిన నాయకులు. ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన చూపిన మార్గంలో నడవడం మన బాధ్యత. ఆయన సుదీర్ఘాజలం రాజకీయాలలో ఉండి ప్రజా సేవ చేశారు, ఆయన కరోనో తో స్వర్గస్తులు కావడం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం… ఆయన ఆశయాలు కొనసాగిస్తాం అని తెలిపారు.

Related posts