కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.బడ్జెట్ ప్రసంగం చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైనదిగా ఉంది కానీ, తరచి చూస్తే వట్టి డొల్లలాగే ఉందని విమర్శించారు. ఈ బడ్జెట్ లో చెప్పుకోదగ్గ విషయాలేవీ లేవని అన్నారు.
దేశంలో నిరుద్యోగమే ప్రధాన సమస్యగా ఉందని, కానీ యువతకు ఉద్యోగాల కల్పనకు తోడ్పడేలా ఏదైనా ప్రణాళికబద్ధంగా చేశారా అంటే అదీలేదని వ్యాఖ్యానించారు. వ్యూహాత్మకంగా తప్పించుకునేలా ఉందే తప్ప సమస్య పరిష్కార కేంద్రంగా బడ్జెట్ లేదన్నారు. బడ్జెట్ అంతా చిందరవందరగా ఉందని విమర్శించారు. బడ్జెట్ లో చాతుర్యం ప్రదర్శించారే తప్ప ఎలాంటి ముఖ్యోద్ధేశాలు కనిపించలేదని వెల్లడించారు.