ఏపీలో పంచాయితీ ఎన్నికల విషయంలో ఎప్పటినుండో హల్ చల్ నడుస్తుంది. ఇక ఈ మధ్యే ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకగా రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎన్నికల కమిషన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలసి ఫిర్యాదు లేఖను వైకాపా నేత లేళ్ల అప్పిరెడ్డి అందించారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబుపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేసినందున చర్యలు తీసుకోవాలని మేము కోరామని అన్నారు. అయితే విచారించిన ఎస్ఈసీ తెదేపా మేనిఫెస్టోను మాత్రమే రద్దు చేశారని అన్నారు. ఎన్నికల నియమావళిని చంద్రబాబు ఉల్లంఘించారని ఎస్ఈసీ దృష్టికి తెచ్చామని అయినా సరే మేనిఫెస్టో రద్దు చేసి కేవలం తూతూ మంత్రంగా ఎస్ఈసీ చర్యలు తీసుకున్నారని అన్నారు. చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని ఎస్ఈసీని కోరామని అన్నారు.
previous post
కుప్పం కెనాల్ పనుల నిలిపివేతపై చంద్రబాబు ఫైర్