telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ రాజధానుల కేసులో షాక్.. జగన్ కు హైకోర్టు నోటీసులు!

cm jagan ycp

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. మూడు రాజధానుల కేసులో ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. సీఎం జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి, అధికారంలోకి రాగానే మరో మాదిరి జగన్ మాట మార్చారని పిటిషన్ లో రైతులు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.ఇదే విషయమై హైకోర్టులో ఇతరులు కూడా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను ఈరోజు హైకోర్టు విచారించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఏపీ ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్ ను మాత్రమే దాఖలు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రతి పిటిషన్ కు ఒకొక్క కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ, బీజేపీలకు కూడా లీగల్ నోటీసులు జారీ చేసింది.

Related posts