ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నేత భూమా అఖిలప్రియ బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ1 గా ఉన్న సంగతి తెలిసిందే. అఖిలప్రియను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హాఫిజ్ పేట భూముల విషయంలో కిడ్నాప్ కు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఈ కేసులో ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ3 గా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ను చేర్చారు. అయితే, భార్గవ్ రామ్ ఎక్కడ ఉన్నాడో పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేదు. నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటె, ఈ కిడ్నాప్ కేసులో అనేకమంది నిందితులను పోలీసులు గుర్తించారు. వీరికోసం గాలిస్తుండగా, కొంతమంది గోవాలో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. విజయవాడలోని నిందితుల ఇళ్లకు పోలీసులు వెళ్లగా, అక్కడ కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు గోవాలో ఉన్నారని, తెలియడంతో అక్కడ కూడా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా, విజయవాడలో అదుపులోకి తీసుకున్న నిందితులను ఈరోజు రాత్రికి హైదరాబాద్ తీసుకురాబోతున్నారు. భార్గవ్ రామ్ పోలీసులకు దొరికితే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
చిదంబరం కేసులకు ఆధారాలు: నితిన్ గడ్కరీ