telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆ ప్రాంత రోడ్లు తెరిపించాలి.. రాజ్ నాథ్ కు రేవంత్ లేఖ

Revanth-Reddy mp

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిస్థితులపై లేఖలో వివరించారు. ఆర్మీ వర్గాల ప్రాబల్యం ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో సాధారణ పౌరులు వెళ్లేందుకు వీల్లేకుండా దాదాపు 20 రోడ్లను మూసేశారని ఆరోపించారు.

తన నియోజకవర్గ ప్రజలు సుమారు 10 లక్షల మంది వరకు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారని తెలిపారు. దయచేసి రోడ్లు తెరిపించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక మిలిటరీ అధికారులను ఆదేశించాలని కోరారు. ఆ రోడ్లను తెరవాలంటూ గతంలో కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రతులను కూడా రేవంత్ లేఖకు జతచేశారు.

Related posts