telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మరో టీఆర్ఎస్ సీనియర్ నేత మృతి…

అయితే ఈ మధ్య టీఆర్ఎస్ సీనియర్ నేతలు వరుసగా మరణిస్తున్నారు. తాజాగా మరో టీఆర్ఎస్ సీనియర్ నేత కమతం రాంరెడ్డి కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 83 సంవత్సరాలు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లోనే రాజకీయాలు చేసిన ఆయన 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టికెట్ లభించకపోవడంతో బీజేపీలో చేరారు. అప్పటి టిడిపి బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా పరిగి నుంచి ఆయన అసెంబ్లీ కి పోటీ చేశారు. అయితే ఆయన అప్పుడు మూడో స్థానానికి పరిమితం కావలసి వచ్చింది. 2018 ఎన్నికల సమయానికి ఆయన్ని బీజేపీ సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో ఎన్నికలు ముగిశాక ఆయన కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం ఆయన వయసు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈయన గతంలో ముగ్గురు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పని చేశారు. జలగం వెంకట్రావు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉండగా వారి క్యాబినెట్లో ఈయన మంత్రిగా పనిచేశారు. ఇక ఈ మాజీ మంత్రి వయోభారంతో మరణించినట్లు తెలుస్తుంది.

Related posts