telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

టీం ఇండియాకు షాక్… పొట్టి సిరీస్ కు జడేజా దూరం

ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ కు భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా దూరం అయినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజాకు గాయం అయింది. దాంతో అతని స్థానంలో యుజ్‌వేంద్ర చాహల్ జట్టులో చేరాడు. కానీ మిగిలిన రెండ్లు మ్యాచ్ లలో రవీంద్ర జడేజా స్థానంలో ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ ఆడనున్నట్లు బీసీసీఐ తెలిపింది. మెడికల్ టీం ఇన్నింగ్స్ విరామ సమయంలో డ్రెస్సింగ్ రూంలో జడేజాను పరీక్షించింది అని… టెస్ట్ సిరీస్ కు అతను అందుబాటులో ఉండాలి కాబట్టి అతను ఈ పొట్టి ఫార్మాట్ లో ఇక ఆడాడు అని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆసీస్ భారత్ గెలిచిన చివరి వన్డే అలాగే మొదటి టీ20 మ్యాచ్ లో జడేజా కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో బ్యాట్ తో జట్టును ఆదుకున్నాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య రేపు రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మరి జడేజా లేకుండా ఏ మ్యాచ్ లో భారత్ విజయం సాధించగలదా… లేదా అనేది చూడాలి.

Related posts