మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపుతోంది. రెజిమెంటల్ బజార్లో గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కీర్తనను.. గుర్తుతెలియని వ్యక్తులు మీ నాన్నను చూపిస్తామంటూ మాయమాటలు చెప్పారు. ఆ తర్వాత పాపను బైక్మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు.
యాక్టీవాపై బాలికను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్లు స్థానికులు గమనించారు. ఆ తర్వాత వెంటనే.. చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కిడ్నాప్ కు గురైన ప్రాంతంలో పరిశీలిస్తున్నారు.