telugu navyamedia
క్రైమ్ వార్తలు

నాన్నను చూపిస్తామని ..చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండ‌గులు

మూడేళ్ల  చిన్నారి కిడ్నాప్ ఘటన సికింద్రాబాద్ లో కలకలం రేపుతోంది. రెజిమెంటల్‌ బజార్‌లో గురువారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి కీర్తనను.. గుర్తుతెలియని వ్యక్తులు మీ నాన్నను చూపిస్తామంటూ మాయమాటలు చెప్పారు. ఆ తర్వాత పాపను బైక్‌మీద ఎక్కించుకొని తీసుకెళ్లారు.

యాక్టీవాపై బాలికను ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్లు స్థానికులు గ‌మ‌నించారు. ఆ తర్వాత వెంటనే.. చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక కిడ్నాప్ కు గురైన ప్రాంతంలో పరిశీలిస్తున్నారు.

 

 

Related posts