telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కబడ్డీ ఆడుతూ పడిపోయిన ఏపీ స్పీకర్ తమ్మినేని..

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలో గురువారం క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించిన ఆయన.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా ప్లేయర్‌గా బ‌రిలోకి దిగారు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వాళ్లందర్నీ హుషారెత్తించారు. ఈ క్రమంలో కాలు స్లిప్ కింద పడిపోయారు. సీతారాం కిందపడగానే సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే సీతారాంను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.

Should an assembly speaker shut his mouth?

శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలో పొట్టి ప్రో కబడ్డీ క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో సీఎం కప్ పేరుతో టోర్నమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్‌ కాలేజీ వేదికగా ఆ నియోజకవర్గం స్దాయి సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంబించారు ఎపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.

Related posts