ఐపీఎల్ 2021 లో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ.. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 12 మధ్య లీగ్ను పూర్తి చేయాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుంది. గతేడాది జరిగినట్లుగానే షార్జా, దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో ఈ సీజన్లో మిగిలిపోయిన 31 మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ యూఏఈ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ చానెల్ వివరాల ప్రకారం.. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించేలా ఇరు బోర్డులు ప్రయత్నాలు చేస్తున్నాయంట. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వారికే టికెట్లు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసిందట. అయితే భారత్ వేదికగా జరిగిన ఫస్ట్ ఆఫ్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించని విషయం తెలిసిందే. యూఏఈ వేదికగానే జరిగిన గత సీజన్లో కూడా ఫ్యాన్స్ లేకుండానే మ్యాచ్లు జరిగాయి.
previous post
next post
వైసీపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ చెప్పిన చోట జగన్ సంతకం: చంద్రబాబు