ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అనేక రూపాలను సంతరించుకుంటుంది. ఇప్పటికే కరోనా, కరోనా ప్లస్, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి రూపాల్లో ప్రజలను భయపెట్టింది. భయపెడుతుంది కూడా. ఒమిక్రాన్ వైరస్ కారణంగా దేశంలో కరోనా థర్డ్ వేవ్ శరవేగంగా వ్యాపించింది. ఈ వైరస్ దెబ్బకు ప్రతి రోజూ 3 లక్షలకుపై ప్రజలు ఈ వైరస్ బారినపడుతున్నారు.
ఈ వైరస్ను తొలుత సౌతాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించారని, ఇప్పటివరకు అది మనుషులకు సోకలేదని వివరించారు. ప్రస్తుతం జంతువుల నుంచి జంతువులకు మాత్రమే పాకుతున్న ఈ వైరస్… మున్ముందు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని వుహాన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న టీకాలేవీ ఈ వైరస్ను ఎదుర్కొనలేవని స్పష్టం చేశారు.
పేదవాడి ఆరోగ్యం ప్రభుత్వానికి చులకనైపోయింది: బోండా ఉమా