telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తిరుమలలో ఉద్రిక్తత.. ఆందోళనకు దిగిన శ్రీవారి భక్తులు

Tirumala

తిరుమలలో శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి మెట్ల వద్ద గోవింద నామస్మరణతో భక్తులు ఆందోళన చేస్తున్నారు. వందలాది కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చే భక్తులకు దర్శనం లేదని టీటీడీ ముందే ప్రకటించకుండా, ఇప్పుడు తిరుమలకు వెళ్ళనివ్వకపోవడంతో శ్రీవారి మెట్ల వద్ద ధర్నాకు దిగారు భక్తులు. అంతేకాదు… టీటీడీ పాలకమండలికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా భక్తులను అడ్డుకున్నారంటూ అంటూ భక్తులు ఆవేదన చెందుతున్నారు. తిరుమలకు వెళ్లకుండా వెనుదిరిగేది లేదంటూ ధర్నాకి దిగారు భక్తులు. అనంతపురం, తమిళనాడు, కర్ణాటకల లోని వివిధ జిల్లాల నుంచి భారీగా కాలినడకన శ్రీవారి మెట్ల వద్ద చేరుకున్నారు భక్తులు. భక్తులను అదుపు చేసేందుకు భారీగా పోలీసులను రప్పించారు అధికారులు. దీంతో భక్తులు, పోలీసుల మధ్య వాగ్వాదం ఏర్పడింది.

Related posts