జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సత్తెనపల్లి వైసీపీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవన్ తన పేరును సార్థకం చేసుకుంటున్నారని అన్నారు. పవనం అంటే గాలి అని, కళ్యాణ్ గాలి మాటలు మాట్లాడుతూ తన పేరుకు సార్థకత చేకూర్చుకుంటున్నాడని అన్నారు.
చంద్రబాబు చేస్తున్న రౌండ్ టేబుల్ నాటకాలు అందరికీ తెలుసని, బాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల మాటలకు ఏ మాత్రం గౌరవం ఇచ్చారో పవన్ కు తెలియదా అని మండి పడ్డారు. అప్పుడు చంద్రబాబును నిలదీయలేని పవన్ ఇప్పుడు ప్రతిపక్షాల తరపున మాట్లాడటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు.
తెలంగాణ కాంగ్రెస్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!