telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలి: మాయావతి

mayawati

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఈ సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తే… ఆ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని మాయావతి తెలిపారు.

నిశితమైన పరిశీలన తర్వాత కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు కేంద్రం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించినట్లయితే, దాన్ని బీఎస్పీ స్వాగతిస్తుందని ఆమె ట్వీట్ చేశారు. పేదలు, బలహీన వర్గాలు, కార్మికులు, రైతులకు సాయం చేయాలని, వారిని దృష్టిలో ఉంచుకొనే తగిన నిర్ణయాలు తీసుకోవాలని మాయావతి సూచించారు. వైద్యులు, నర్సులు, పోలీసుల కుటుంబాలను రక్షించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts