telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

జీహెచ్‌ఎంసీ మినహా..టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

exam hall

తెలంగాణలో టెన్త్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేసింది. జీహెచ్‌ఎంజీ పరిధిలోని విద్యార్థులకు సప్లమెంటరీ పరీక్షలకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

విద్యార్థులకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖనుహైకోర్టు ఆదేశించింది. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ సందర్భంగా హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తాజా తీర్పుతో పరీక్షలు నిర్వహణకు అధికారులు అన్నీ ఏర్పాట్లు సిద్దం చేయనున్నారు.

Related posts