telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అదే జీవోను జగన్ మళ్లీ బయటకు తీశారు: చంద్రబాబు

chandrababu

పత్రికా స్వేచ్ఛను హరించేలా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఓ జీవో తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే జీవోను ప్రస్తుత సీఎం జగన్ కేబినెట్ మీటింగ్ లో పెట్టారని చంద్రబాబు విమర్శించారు. రాజశేఖరరెడ్డి ఆ జీవోకు వ్యతిరేకంగా అన్ని పార్టీల నేతలు, మీడియా ప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారని. తక్షణమే జీవోను రద్దు చేస్తున్నానని ప్రకటించారని తెలిపారు. తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని ఆయన చెప్పారని తెలిపారు.

మీ ప్రమేయం లేకుండా జీవో ఎలా వస్తుందో చెప్పమని తాము వైయస్ ను ప్రశ్నించామని చంద్రబాబు చెప్పారు. దీనికి సమాధానంగా విచారణ జరిపిస్తామని వైయస్ చెప్పారని తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే వైయస్ విజ్ఞతను మనం అభినందించాలని చెప్పారు. రాజకీయ నేతలు, మేధావులు అందరి స్పందన చూసిన తర్వాత జీవోను విత్ డ్రా చేశారని తెలిపారు.

Related posts