telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయసాయిరెడ్డికి చత్వారం వచ్చిందేమో: బుద్ధా వెంకన్న

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తిచేయలేదని విజయసాయిరెడ్డి చెప్పడంపై ఘాటుగా స్పందించారు. విజయసాయిరెడ్డికి వయసు పెరగడంతో చత్వారం వచ్చిందేమో అని ఎద్దేవా చేశారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ డెల్టాకు నీటిని విడుదల చేశారంటే అది పట్టిసీమ ప్రాజెక్టు వల్లేనని స్పష్టం చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో బుద్ధావెంకన్న స్పందిస్తూ..విజయసాయిరెడ్డి గారు! తెదేపా ప్రభుత్వం కట్టిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా మీకు కనపడలేదంటే వయసు పెరిగి చత్వారం వచ్చిందేమో అని ట్వీట్ చేశారు. మీకు చత్వారంతో పాటు అల్జీమర్స్ వ్యాధి కూడా వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. గజినీ సినిమా హీరోలాగా టీడీపీ కట్టిన ప్రాజెక్టుల పేర్లు ఎక్కడన్నా రాసిపెట్టుకోండని బుద్ధా వెంకన్న దుయ్యబట్టారు.

Related posts