దీక్షత్ హత్యపై ఎస్పీ కోటిరెడ్డి ప్రెస్మీట్ ఇవాళ మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్బంగా దీక్షత్ హత్య కేసులో సంచలన విషయాలను బయట పెట్టారు. ఈనెల 18న రంజిత్రెడ్డి పెద్దకుమారుడు దీక్షిత్ను కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆదివారం సా.6గంటలకు బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు..కిడ్నాప్ చేసిన 2గంటలోనే దీక్షిత్ ను హత్య చేసాడని ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. అతి తొందరగా డబ్బులు సంపాదించాలనే దురాశతోనే కిడ్నాప్ చేసారని..దీక్షిత్ ను కిడ్నాప్ చేసింది..చంపింది ఒక్కడేనని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మెకానిక్ మంద సాగర్…దొరికిపోతామనే భయంతోనే బాలుడిని చంపేశాడని ఎస్పీ చెప్పారు. సీసీ కెమెరాల లేని ప్రాంతం నుంచి బాలుడిని తీసుకెళ్లారని..తెలిసినవాళ్లు కావడం వల్లే వారితో బాలుడు వెళ్లాడని ఎస్పీ అన్నారు. మంద సాగర్కు సీసీ కెమెరాలు, సెల్ టవర్లు ఎక్కడున్నాయో తెలుసని..బాలుడి కిడ్నాప్కు ముందు రెక్కీ నిర్వహించారని ఎస్పీ చెప్పారు. బాలుడిని కిడ్నాప్ చేసిన సీసీ కెమెరాల దృశ్యాలు సేకరించామని..సాయంత్రంలోగా పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
previous post