విద్వేష భావజాలంతోనే తాము పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఈ మేరకు స్పందించారు.అధికారంలోకి వస్తే అన్నివర్గాలను గౌరవిస్తామని అన్నారు. అసమ్మతి వ్యక్తం చేసే గొంతుకలను అణచివేయబోమని స్పష్టం చేశారు. వరుసలో నిలబడ్డ చివరి వ్యక్తికి కూడా న్యాయం అందాలని గాంధీజీ చెప్పేవారనీ, దాన్ని తాము పాటిస్తామని రాహుల్ అన్నారు.
భారత్ ప్రేమతో కూడుకున్న దేశమనీ, ప్రేమ కారణంగానే దేశం పురోగమించగలిగిందని పేర్కొన్నారు. దేశంలోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) సభ్యులకు వ్యతిరేకంగా హింస చెలరేగినా, అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్వేష భావజాలం, సిద్ధాంతాలకు వ్యతిరేకంగానే పోరాడుతున్నామనీ రాహుల్ స్పష్టం చేశారు.
ఎగ్జిట్ పోల్స్ తో జగన్ సంబురపడిపోతున్నారు: దేవినేని ఉమ