హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ళు ఆన్లైన్లో బెట్టింగ్కు పాల్పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న 13 మందిని అరెస్ట్ చేశారు. పరారీలో మరో ఇద్దరు యువకులు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ. 1,08,000 నగదు, రెండు ల్యాప్టాప్స్, 20 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post