telugu navyamedia
సినిమా వార్తలు

నిర్మాతగా మారుతున్న కాజల్… “మను చరిత్ర” ప్రారంభం

kajal with own banner idea with first movie

న‌టీనటులు, సాంకేతిక నిపుణులు సినిమాకు సంబంధించిన ఇత‌ర విభాగాల్లో కూడా రాణించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హీరో, హీరోయిన్స్ విష‌యానికి వ‌స్తే వారు సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు.. నిర్మాణ రంగంలో కూడా ఆస‌క్తి చూపుతున్నారు మ‌హేష్‌, రామ్‌చ‌ర‌ణ్‌, రానా, నాని.. ఇలా చాలా మంది హీరోలు ప్రొడక్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేసిన‌వారే. టాలీవుడ్ హీరోయిన్స్‌లో కాజ‌ల్ అగర్వాల్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. “మ‌ను చ‌రిత్ర‌” చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ చిత్రానికి కాజల్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ముహూర్త‌పు స‌న్నివేశానికి కాజ‌ల్ అగ‌ర్వాల్ క్లాప్ కొట్ట‌గా.. సి.కళ్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అజ‌య్ భూప‌తి ముహూర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుధీర్ వ‌ర్మ‌, సాహు గార‌పాటి స్క్రిప్ట్‌ను అందించారు.

రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి, మేఘా ఆకాశ్ జంట‌గా న‌టిస్తున్నారు. భ‌ర‌త్ కుమార్.పి ద‌ర్శ‌కుడు. గోపీసుంద‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ మేనేజ‌ర్ రాన్స‌న్ ఈ చిత్రంతో నిర్మాత‌గా మారుతున్నారు. ఆయ‌న‌తో క‌లిసి ఎన్‌.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోష‌న‌ల్ ఇన్ టెన్స్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `ఫాలింగ్ ఇన్ ల‌వ్ ఈజ్ ఏ పెయిన్‌ఫుల్ జాయ్‌` ట్యాగ్‌లైన్‌. డాలీ ధ‌నుంజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Related posts