telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయి: చినరాజప్ప

chinarajappa Mla

రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పెరిగిపోయాయని ని టీడీపీ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.  వైసీపీ అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు.

విశాఖపట్నంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసిందని అన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఈ భూముల వ్యవహారంపై విచారణ జరిపే దమ్ము జగన్ కు ఉందా? అని ప్రశ్నించారు.అమరావతిలో సీఆర్డీఏ హద్దులకు అవతల ఉన్న ప్రాంతాల్లోని భూములను కూడా రాజధాని భూములుగా విషప్రచారం చేస్తున్నారని చినరాజప్ప దుయ్యబట్టారు.

Related posts