తిరుమల శ్రీవారి ఆస్తులు విక్రయించడానికి టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తూ ఏపీ బీజేపీ నేతలతో పాటు జనసేన నేతలు కూడా ఈ రోజు ఉపవాస దీక్షలు చేస్తున్నారు.దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ… ‘టీటీడీ భూముల అమ్మకం ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నప్పటికీ ధర్మ పరిరక్షణ కోసం ఉపవాస దీక్షని కొనసాగిస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ రోజు ఉదయం 9 గంటలకు బీజేపీతో కలిసి జనసేన ప్రారంభించిన ఈ దీక్షలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని చెప్పారు. తన నివాసం వద్ద తాను కూడా ఈ దీక్షల్లో పాల్గొంటున్నానని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఉపవాస దీక్ష ప్రారంభించేముందు వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఆయన పూజలు చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం ఆలయ భూములను అమ్మాలనుకోవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు.