మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై రామ్ చరణ్, నిరంజన్రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అయితే… చిరంజీవి ఏ ముహూర్తాన నిన్న సాయంత్రం ‘ఆచార్య’ టీజర్ గురించి మీమ్స్ రూపంలో తన స్పందన తెలియచేశాడో కానీ… సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ హీరోలు దానిని కొనసాగిస్తున్నారు. చిరంజీవి ప్రశ్నకు జవాబుగా దర్శకుడు కొరటాల శివ ‘ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4.05 నిమిషాలకు ‘ధర్మస్థలి ద్వారాలు తెరుస్తా’మం’టూ ప్రకటించారు. అయితే… అప్పటి వరకూ వేచి ఉండటం మెగాభిమానులకే కాదు… మెగా ఫ్యామిలీ హీరోలకూ కష్టంగానే ఉంది. సాయిధరమ్ తేజ్ ‘ఖైదీ నంబర్ 150’లో చిరంజీవి ఆవేశంగా చేతిలోని గొడ్డలిని నేలకేసి కొట్టే బిట్ ను ట్వీట్ చేశాడు. ఇంకెంత సేపు వెయిట్ చేయాలి అన్నట్టుగా! ఇక వరుణ్ తేజ్ అయితే… మీమ్స్ ద్వారా టీజర్ విషయంలోని ఓ ఆసక్తికరమైన అంశాన్ని రివీల్ చేశాడు. ‘చరణ్ అన్న వాయిస్ ఓవర్ అంటకదా టీజర్ కి’ అని బ్రహ్మానందం గిరిబాబుతో చెబుతూ, ‘ఆహా… బయట టాక్’ అనిపించాడు. నిహారిక నిన్న చిరంజీవి ట్వీట్ కు సమాధానంగా…. ‘డాడీ రేపటి వరకూ వెయిట్ చేయడం కష్టం… మీరు లీక్ చేసేయండి’ అంటూ ట్వీట్ చేసింది… మొత్తం మీద… ‘ఆచార్య’ టీజర్ విషయంలో మెగా ఫ్యామిలీ హీరోలు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
previous post
ఆంధ్రా మరో బీహార్ లా తయారైంది.. బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు