telugu navyamedia
రాజకీయ వార్తలు

బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ లేదు: శరద్ పవార్

Loksabha Elections MP Contest Sharad pawar

మహారాష్ట్రలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీని కొన్ని రోజుల క్రితం గవర్నర్ కోష్యారీ ఆహ్వానించినప్పటికీ ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ .. బీజేపీపై శరద్ పవార్ విమర్శలు గుప్పించారు.

ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ లేనందునే మొదట ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తమకు మెజారిటీ లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని గవర్నర్ కు లేఖ కూడా రాశారు’ అని తెలిపారు. ‘మేము మా ఎమ్మెల్యేలతో కలిసి చర్చలు జరుపుతున్నాం. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి ఎన్సీపీ మద్దతు తెలపడం లేదు’ అని శరద్ పవార్ స్పష్టం చేశారు.

Related posts