telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉత్తమ్‌..మీ నెంబర్‌ నేను బ్లాక్‌ చెయ్యగలనా: కేటీఆర్‌

KTR meet Uttam Kumar Reddy

తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ పేరు ఖరారైంది. ఆయన శనివారం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఏకగ్రీమయ్యేలా టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని కలిశారు. డిప్యూటీ స్పీకర్‌ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు ఇవ్వాలని ఉత్తమ్‌ని కేటీఆర్‌ కోరారు. వీరిద్దరి భేటీ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

తన ఫోన్‌నెంబర్‌ను ఎందుకు బ్లాక్‌ చేశారని ఉత్తమ్‌.. కేటీఆర్‌ను అడిగారు. దీనికి కేటీఆర్‌ బదులిస్తూ.. మీ నెంబర్‌ నేను బ్లాక్‌ చెయ్యగలనా?.. నేను కేవలం మెసేజ్‌లు మాత్రమే చూస్తాను అని అన్నారు. కాగా ఏకగ్రీవం ఎన్నిక కోసం అంతకుముందే సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కేటీఆర్‌ భేటీ అయిన విషయం తెలిసిందే.

Related posts