telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఐజీఎస్టీ కమిటీలో హరీశ్ రావుకు చోటు

Harish Rao trs

ఐజీఎస్టీ (సమగ్ర వస్తు, సేవల పన్ను) సమస్యల పరిష్కారం కోసం నియమించిన మంత్రుల బృందంలో కమిటీ మార్పులు చేసింది. జీఎస్టీ మండలి ఏడుగురితో కొత్త కమిటీని నియమించింది. ఇందులో తెలంగాణ మంత్రి హరీశ్‌రావుకు చోటు లభించింది.

తాజా కమిటీకి బీహార్ ఆర్థికమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాగా, ఐజీఎస్టీ సమస్యల పరిష్కారం, సంబంధిత అంశాలపై గతేడాది డిసెంబరులో కమిటీ ఏర్పాటు అయింది. ఇప్పుడు దానిలో మార్పులు చేసినట్టు జీఎస్టీ కార్యాలయం తెలిపింది.

Related posts