telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగన్‌ అమ్ముడుపోయారు: డిప్యూటీ సీఎం

Krishna Murthy
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేసుల కోసమే ప్రధాని మోదీకి  అమ్ముడుపోయారని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి  ఆరోపించారు. కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్‌ అవినీతి చక్రవర్తి అంటూ మండిపడ్డారు. ఏపీకి అన్యాయం చేస్తున్న మోదీని జగన్‌ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. 
సీఎం కాకముందు వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిది కరెంట్ బిల్లు కూడా కట్టలేని పరిస్థితి అని ఆరోపించారు. అలాంటి వైఎస్‌ సీఎం అయ్యాక వందల కోట్లు ఎలా సంపాదించారని కేఈ ప్రశ్నించారు. వైఎస్ సీఎం  అయ్యాక వందల కోట్లు ఎలా వచ్చాయని కేఈ ప్రశ్నించారు.  దీన్ని బట్టి చూస్తే జగన్ ఎంత అవినీతిపరుడో అర్థమవుతుందని కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. 

Related posts