బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించారు. కార్మికుల సమ్మెతో గనులు అన్ని మూతపడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు.
బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా వేలాదిమంది బొగ్గు గని కార్మికులు సమ్మెలో ఉన్నారన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ సైతం సమ్మెలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.