అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, ప్రజా ప్రతినిధిగా అర్ధశతాబ్ధానికి పైగా ప్రజలకు సేవలందించిన కొణిజేటి రోశయ్య మృతిపట్ల భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరిస్తూ, పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన రోశయ్య మృతి తెలుగు వారికి తీరనిలోటన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలసి ఉండాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని మనసారా కోరుకున్న రోశయ్య, విలువలకు, సత్సంప్రదాయాలకు మారుపేరుగా నిలిచిన పాతతరం నేతల్లో ఒకరని ఎన్వీరమణ ప్రస్తుతించారు.
తెలుగు భాష, కళలు, సంస్క్రుతికి రోశయ్య పెద్ద పీట వేశారని గుర్తు చేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఆయన సానుభూతి తెలిపారు.
తన జీవితం ప్రజలకే అంకితం: కవిత