telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

క‌శ్మీరీ వ్యాపారుల‌ను చితకబాదిన హిందూ ద‌ళ్

Kashmiri men thrashed Hindu Dal

పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఉత్తర భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో క‌శ్మీరీల పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ల‌క్నోలో ఇద్దరు క‌శ్మీర్ వ్యాపారుల‌పై స్థానిక అతివాదులు దాడికి పాల్పడ్డారు. రోడ్డు పై డ్రై ఫ్రూట్స్ అమ్ముకునే ఆ వ్యాపారుల‌ను చిత‌క‌బాదారు. బుధ‌వారం సాయంత్రం ద‌లీగంజ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

కాషాయం దుస్తుల్లో వ‌చ్చిన కొంద‌రు ఆ వ్యాపారుల‌పై విరుచుకుప‌డ్డారు. అయితే అక్కడున్న కొంద‌రు అడ్డుకోవ‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. గ‌త కొన్నేళ్లుగా ల‌క్నోలో క‌శ్మీరీలు డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్నారు. విశ్వ హిందూ ద‌ళ్ వ్యక్తులు దాడి చేసిన‌ట్లు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts