కర్ణాటకలో రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీజేపీ ముందస్తు చర్యలు చేపట్టింది. బీజేపీ ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్ లో మకాం వేసారు. నేటి కుమారస్వామి విశ్వాస పరీక్ష నిమిత్తం అసెంబ్లీకి వెళ్లే ముందు హోటల్ లాన్ లో యోగా చేశారు. బెంగళూరులోని రమదా హోటల్ లో ఉన్న వీరు, ఓ యోగా గురువు సూచనల మేరకు యోగా చేస్తూ కనిపించారు. కాంగ్రెస్ – జేడీఎస్ నేతలు తమ ఎమ్మెల్యేలపై వల విసిరే ప్రమాదం ఉన్నందున, అందరు ఎమ్మెల్యేలనూ బీజేపీ హోటల్ లో ఉంచి కాపలా కాస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ రెబల్స్ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటికీ ముంబైలోనే ఉన్నారు. సీమ్ కుమారస్వామి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరడంతో నేడు కూడా విశ్వాస పరీక్ష జరిగే అవకాశాలు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. మరోవైపు కుమారస్వామితో పాటు రెబల్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ సాగనుంది.