మన దేశానికి చెందిన మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్ అయిన భారత్ బయోటెక్ కోవాక్సిన్ను ఫిబ్రవరి నెలలో వేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. పైసా ఖర్చు లేకుండా ప్రాధాన్య సమూహాలను గుర్తించి వ్యాక్సిన్ ను అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నిపుణులతో చర్చించి 30 లక్షలమంది ప్రాధాన్య సమూహాలను గుర్తించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశంలో ప్రాధాన్యత క్రమం ప్రకారం నాలుగువర్గాలుగా విభజించి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. కోటి మంది ఆరోగ్యనిపుణులు, వైద్యులు, నర్సులు, ఆశా కార్మికులు, ఎంబీబీఎస్ విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. ఇక, ఫ్రంట్ లైన్ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు, పోలీసు సిబ్బంది, సాయుధ దళాలకు చెందిన 2 కోట్ల మందికి రెండో విడత వ్యాక్సిన్ ఇస్తారు. మూడో వర్గమై 50 ఏళ్లు పైబడిన 6 కోట్లమంది వృద్ధులకు, వయసు ప్రాధాన్యతా క్రమంగా వ్యాక్సిన్ అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. 50 ఏళ్ల వయసు కంటే తక్కువగా ఉన్నా అనారోగ్యంతో బాధపడుతున్న కోటిమందిని ప్రత్యేక వర్గంగా గుర్తించి వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించారు. ఆధార్ కార్డు లేకపోయినా ప్రభుత్వ ఫొటో గుర్తింపును ఉపయోగించుకొని లబ్ధిదారులను గుర్తించి వారందరికీ ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. కరోనా టీకాలు వేసేందుకు వీలుగా ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది.
previous post
next post
జబర్దస్త్ తో గొప్పగా పేరు తెచ్చుకున్న రోజా.. రియల్ లైఫ్ లోనూ గొప్పగా నటిస్తోంది: నన్నపనేని