telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కర్నూలు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా శ్రీధర్‌ రెడ్డి

karnool

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పల్లె శ్రీధర్‌రెడ్డిని నియమిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం వినీత్‌రెడ్డి తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం వినీత్‌రెడ్డి తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి కొవ్వూరి విజయభాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని నియోజకవర్గాల్లో కన్వీనర్‌ హోదాలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు.

సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన క్రియాశీలక సభ్యులతో పూర్తి స్థాయి కమిటీని నియమించామని తెలిపారు. కర్నూలు నగర అధ్యక్షుడిగా పాటిల్‌ తిరుమలేశ్వరరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడిగా డి.హరినాథ్‌రెడ్డిని నియమించినట్లు కమిటీ వెల్లడించింది. అనంతరం కర్నూలు జిల్లా నూతన కమిటీ వివరాలను వెల్లడించారు.

Related posts