telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబుకు ‘కమ్మ’ల పై ప్రేమ ఉన్న..అందరినీ సమానంగా చూస్తారు: జేసీ

TDP MP JC Diwakar reddy sensational comments
ఏపీ సీఎం చంద్రబాబు పై టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన నియోజకవర్గ ప్రజలతో మాట్లాడిన ఆయన, చంద్రబాబులో కమ్మ కులపు వారిపై  ప్రేమ ఉన్నా, అందరినీ సమానంగా చూసే వ్యక్తేనని కొనియాడారు. కాస్తంత మంచితనం కూడా ఉందని జేసీ వ్యాఖ్యానించారు.  చంద్రబాబు వైఖరి సరైనదేనని, అలాగే ఉండాలని అభిప్రాయపడ్డారు. 
 నీళ్ల విషయంలో ఆయనకు కమ్మ లేదు కాపు లేదు. కష్టపడి పని చేస్తాడు. వాడు గనుక నీళ్లు తేకుంటే నేను ఎన్నడో గుడ్ బై చెప్పేసేవాడిని. పోయిన ఎలక్షన్స్ లో ఒక్క పైసా ఇవ్వలా. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఆ నా… ఒక్కపైసా ఇవ్వలా.  ఇంతకుముందు  నేనే ఖర్చు పెట్టా.. ఇప్పుడూ నేనే ఖర్చు పెట్టా పెట్ట అనిఅన్నారు.  జేసీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Related posts