తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల.. ఆ తర్వాత రోజు.. ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.. వైఎస్ షర్మిల పార్టీ పెడతారని వార్తలు రాగానే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. అయితే.. తాజాగా హైదరాబాద్లోని లోటస్పాండ్ నివాసంలో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అభిమానులతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేయాల్సినవి చేస్తుందా? అని ప్రశ్నించారు షర్మిల. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిందా? అని షర్మిల నిలదీశారు. తెలంగాణలో ఉన్న సమస్యలపై మాట్లాడదామని అభిమానులతో షర్మిల తెలిపారు. 11 ప్రశ్నలతో ఫీడ్బ్యాక్ ఫామ్ నింపాలని అభిమానులను కోరారు షర్మిల.
కాంగ్రెస్ కు ఉన్నంత ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేదు: తలసాని