తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ విస్తరణ పై ఈ రోజు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కలిసి సీఎం తన నిర్ణయాన్ని తెలియజేశారు. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన కేసీఆర్ సీఎంగా రాజ్ భవన్ లో ప్రమాణం చేశారు.
మంత్రివర్గ విస్తరణకు కేసీఆర్ సుధీర్ఘ కాలం పాటు కసరత్తు నిర్వహించారు. ఒకే రకమైన శాఖలను వీలీనం చేసిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ భావించారు. ఈనెల 19న మాఘశుద్ధ పౌర్ణమి కావడంతో ఆ రోజు ఉదయం 11.30 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కేసీఆర్తో పాటు మంత్రివర్గంలో తొలి విడతలో 10 మందికి అవకాశం దక్కనుంది.
పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్లమని ఎవరు చెప్పారు?: యనమలపై రోజా ట్వీట్