ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు దరఖా స్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యా లయం(ఇగ్నో) అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రసాద్బాబు తెలిపారు. గాంధీనగర్లోని ఎస్ఆర్ఎస్వీ బీఈడీ కళాశాలలో శనివారం ‘ఇగ్నో కోర్సులు- నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు’ అంశంపై విజయవాడ ప్రాంతీయ కేంద్రంలో సెమినార్ జరిగింది.
ఈ సందర్భంగా ప్రసాద్బాబు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం జూలై సెషన్కు ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులకు సర్టిఫికెట్, డిప్లొమా, బీఏ, బీకాం కోర్సులకు పూర్తి ఫీజు మినహాయింపు ప్రకటించిందన్నారు. వివరాలకు కొత్తపేట హిందూ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని, 0866-2565959 నెంబర్ను సంప్రదిం చాలన్నారు.
రథం దగ్ధంపై చంద్రబాబు కమిటి..విజయసాయి విమర్శలు