రాజ్భవన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలు కేసీఆర్, జగన్ పాల్గొన్నారు. రాజ్భవన్లోని సాంస్కృతిక మందిరంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ మాసం సందర్భంగా గవర్నర్ నరసింహన్ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా గవర్నర్ నరసింహన్.. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ఇద్దరు ముఖ్యమంత్రులు.. గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఇరు రాష్ర్టాలకు సంబంధించిన పలు అంశాలపై వాళ్లు చర్చించినట్లు సమాచారం.