తిరుమల భక్తులకు టీటీడీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అలిపిరి దగ్గర ఉన్న టోల్గేట్ ఛార్జీల్లో మార్పులు చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న టోల్ గేట్ ఛార్జీల్లో సవరణలు చేసింది టీటీడీ. రూ. 15 నుంచి రూ. 100 వరకు ఉన్న వాహనాల టోల్ ఛార్జీలను… 50 నుంచి రూ. 200 వరకు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలిపిరి ఘాట్ రోడ్డులో వెళ్లే బైక్ల టోల్ ఫీజును పూర్తిగా రద్దు చేసింది. ఇకపై కార్లు, జీపులు, టాటాఎస్, టాక్సీలకు రూ. 50 వసూలు చేస్తారు. అలిపిరిలో మినీ బస్సులు, మినీ లారీలకు వసూలు చేసే ఫీజును రూ. 100కి పెంచింది. భారీ ట్రక్కుల టోల్ ఫీజును రూ. 200కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
previous post