telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఒరిస్సాకు చెందిన మహిళపై వైసీపీ నాయకుడు అత్యాచారయత్నం…

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం ఎన్టీఆర్ కాలనిలో దారుణం జరిగింది. ఒరిస్సాకు చెందిన మహిళ పై కట్టమూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రంగనాదం జీవ అత్యాచారయత్నం చేసాడు. పెద్దాపురం సమీపంలోని రొయ్యల పరిశ్రమలో పని చేస్తున్న మహిళ పై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే రంగనాదం పై సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందిబాధితురాలు. వెంటనేకేసు నమెాదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. జీవపై కేసు నమోదైనప్పటికి కట్టమూరులో జరిగిన అక్షరభ్యాసం కార్యక్రమంలో నిందితుడు పాల్గొనడంతో పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రం నుంచి పని కోసం వచ్చిన మహిళపై దాడులు చేస్తుా, లైంగికంగా వేదిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి మహిళ సంఘాలు. అయితే అతను వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు కావడం కారణంగానే పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు ఆరిపోస్తున్నారు.

Related posts