నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో విచారణ జరిగింది. మే 8నాటికి రీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఇంటర్బోర్డు హైకోర్టుకు తెలిపింది. జవాబు పత్రాలను పున: మూల్యాంకనం చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం ముందు రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కావాలని సూచించింది. విద్యార్ధుల ఆత్మహత్యలు విషాదకరమని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ మే 8కి వాయిదా వేసింది.